అమెరికాలోనూ పేదరికం
ఉపాధి కోసం వెళ్లిన తాను కార్పొరేటర్గా, మేయర్గా పదవులు పొంది న్యూజెర్సీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా భారతదేశానికి, అమెరికాలో ఉన్న వ్యత్యాసాలను వివరించారు. భారతదేశంలో కిందిస్థాయి నుంచి అవినీతి ఉందని, అదే అమెరికాలో పైస్థాయిలోనే ఉందని చెప్పారు. భారతదేశంలో సంపాదించుకోడానికి రాజకీయాల్లోకి వస్తారని, అమెరికాలో సంపాదించుకుని రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు వసూలు చేసే ప్రతి పైసాకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి లెక్కలు చూపాల్సి ఉంటుందన్నారు. అక్కడ రాజకీయాల్లో అవినీతికి పాల్పడితే ఊచలు లెక్కించాల్సిందేనని తెలిపారు. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో సమస్యలే ఉండబోవని అనుకుంటే పొరబాటని, నిరుద్యోగం తాండవిస్తోందని అన్నారు.
ఐటిరంగం కుదేలయిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో సంస్కరణలు వస్తున్నాయని, విద్యావ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు తన అమెరికా పర్యటన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గా రామక్రిష్ణ, నెక్ ఛైర్మన్ రమేష్, టిడిపి జిల్లా అధ్యక్షులు మహదేవనాయుడు పాల్గొన్నారు.
0 comments :
Post a Comment